Lబనశంకరి: తన ఇద్దరు పిల్లలను హత్యచేసిన కేసులో పరప్పన అగ్రహార జైలులో రిమాండ్లో ఉన్న తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గంగాదేవి అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జాలహళ్లిలో నివాసం ఉంటోంది. గంగాదేవి ప్రైవేటు కంపెనీలో, భర్త బీబీఎంపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గంగాదేవి మంగళవారం రాత్రి కుమార్తె లక్ష్మీ(7), గౌతమ్ను ఈనెల 9న దిండుతో ఊపిరా ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం సహాయవాణికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతున్నట్లు తెలిపింది. పోలీసులు రాగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహరజైలుకు తరలించారు. ఆదే రోజు రాత్రి జైలులో ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టర్లు మృతదేహానికి పంచనామా చేపట్టిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈఘటనపై పరప్పనఅగ్రహార పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది
Also read
- 2026 ఉగాది పంచాంగం.. వృషభ రాశి వారికి రాజయోగమే!
- 2026 ఉగాది పంచాంగం : మేష రాశి ఫలితాలు!
- అడక్కుండానే లిఫ్ట్ ఇస్తే మహానుభావుడు అనుకున్నారు.. కాసేపటికి..
- వాట్సప్ మెసేజ్ గొడవ .. హైదరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య!
- అర్ధరాత్రి వృద్ధురాలి అగచాట్లు.. దారి మళ్లించి దోచుకున్న ఆటో డ్రైవర్! ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ముప్పుతిప్పలు




