Lబనశంకరి: తన ఇద్దరు పిల్లలను హత్యచేసిన కేసులో పరప్పన అగ్రహార జైలులో రిమాండ్లో ఉన్న తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గంగాదేవి అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జాలహళ్లిలో నివాసం ఉంటోంది. గంగాదేవి ప్రైవేటు కంపెనీలో, భర్త బీబీఎంపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గంగాదేవి మంగళవారం రాత్రి కుమార్తె లక్ష్మీ(7), గౌతమ్ను ఈనెల 9న దిండుతో ఊపిరా ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం సహాయవాణికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతున్నట్లు తెలిపింది. పోలీసులు రాగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహరజైలుకు తరలించారు. ఆదే రోజు రాత్రి జైలులో ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టర్లు మృతదేహానికి పంచనామా చేపట్టిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈఘటనపై పరప్పనఅగ్రహార పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




