*వెలుగుఅధికారుల డ్రామా…!*
*వెలుగులో చీకటి కోణాలు ఎన్నో..మరెన్నో*
*వెలుగులో అవినీతి కంపు*
ఇందిరానగర్ సంఘమిత్ర నియమాకం పై 16 నెలలుగా కాలయాపన ఎందుకో.
మహిళాల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా నడుస్తున్న YSR క్రాంతిపథం గత కొంతకాలంగా వరదయ్యపాలెం మండలంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి.
వెలుగు కార్యాలయంలో ఉన్న అధికారి అనుకూలమైన సిబ్బందితో అక్రమాలకు పాల్పడుతున్న వైనం. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు అని సభ్యురాలి ఆవేదన.
కొంతమంది నాయకులును గుప్పెట్లో పెట్టుకొని చెక్కలు పై ఫోర్జరీ సంతకాలు చేయడం. గ్రూపులో ఉన్న మొత్తం సభ్యుల సంతకాలు లేకనే సంఘాలకు లోన్లు ఇప్పించడం.
నిబంధనలకు విరుద్ధంగా వివో లీడర్లని నియమాకం చేసుకొని నిధులను ఇష్టారాజ్యంగా బ్యాంకుల నుండి తీయించి కాసులకు కక్కుర్తి పడుతున్నారా.
గ్రూపు సభ్యులులో నా సంతకాలు లేకుండానే వెలుగు అధికారి మా గ్రూపు లోను ఎలా ఇప్పించింది నా సంతకం ఎవరు చేశారు అని ప్రశ్నిస్తున్న సమాధానం దాట వేస్తున్న వెలుగు అధికారి. తమ వాటా తీసుకున్న సిబ్బంది మౌనంగా ఉంటే… అక్రమాలు సహించలేని వారు మాత్రం ఫిర్యాదులు చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇక్కడ జరుగుతున్న మోసాలు *DRDA* వారికి తెలియడం లేదా… లేదా ఇందులో వారి భాగస్వామ్యం కూడా ఉంటుందా అన్న అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024