ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దౌను గూడా గ్రామపంచాయతీ పరిధిలోని రేణిగూడ గ్రామ సమీపంలో గురువారం ఉదయం 120 మంది కూలీలు ఉపాదిహామీ పనుల్లో భాగంగా మట్టి తవ్వకం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ అక్కడే చెట్ల పొదల్లో ఉన్న తేనె తుట్టి నుండి తేనెటీగలు ఒక్కసారిగా లేచి ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల బృందంపై బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో తేనేటీగల ముల్లులు గుచ్చుకుని 40 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది మహిళలకు స్వల్ప గాయాలవగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది 5 ప్రత్యేక అంబులెన్స్ లను ఏర్పాటు చేసి బాదితులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, రిమ్స్ డాక్టర్లు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం తేనీటీగల దాడిలో గాయపడ్డ బాదితుల ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని.. కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటం ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





