విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా నేతలు మంగళవారం తెదేపాలో చేరారు.
మంగళగిరి: విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన
పలువురు వైకాపా నేతలు తెదేపాలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్తోపాటు విల్లూరి భాస్కరరావు, ఉరుకూటి నారాయణరావు, దుర్గాలమ్మ దేవస్థానం ధర్మకర్త బత్తి మంగరాజు, గరుడ సత్రం ధర్మకర్త చరకం మణమ్మ, కంటిపిల్లి వరలక్ష్మి, గౌరీ శంకర్, వర్తక సంఘం జిల్లా సభ్యులు రామిరెడ్డి, నిమ్మ శ్రీనివాస్, ముక్కు శ్రీనివాస్, తదితరులు తెదేపాలో చేరారు. వీరికి చంద్రబాబు తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also read
- గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న విద్యార్థిని.. కాసేపటి తర్వాత కిటికిలోంచి చూడగా..
- బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
- ఎంత పనిచేశావ్ రా.. క్రికెట్ మ్యాచ్లో ఒక్క రన్ కోసం గొడవ.. ఆ తర్వాత కత్తితో దారుణంగా..
- చంపుతా.. అంటూ నిత్యం బెదిరిస్తుంటే.. ఫూటుగా మద్యం తాగించి చంపేశారు!
- గుండె పగిలే విషాదం.. గుడిలో అన్నదానం చేస్తుండగా ఊహించని ఘటన..





