మూడు టన్నుల పిడిఎస్ బియ్యం, 1600 లీటర్ల రిఫండ్ ఆయిల్, రూ.1.30 లక్షల నగదును పట్టుకున్నారు రావులపాలెం పోలీసులు. ఎన్నికల సందర్భంగా రావులపాలెం మండలం గోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో తనిఖీలు సందర్భంగా ఎఫ్.ఎస్.టి టీం వాటిని పట్టుకుంది. పిడిఎస్ బియ్యాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లింగంపాలెం మండలం ఎడవల్లి నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యం సీజ్ చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్న రావులపాలెం సీ.ఐ సిహెచ్ ఆంజనేయులు. పట్టుకున్న రూ.1.30 లక్షలకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని ఆ నగదును జిల్లా త్రిమేన్ కమిటీకి పంపించామని.. రిఫండ్ ఆయిల్కి సంబంధించి స్థానిక తహసిల్దార్కు సమాచారం ఇచ్చామన్నారు సి.ఐ
Also read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





