అందరూ గుడిలో దేవుడ్ని మొక్కేందుకు వెళ్తుంటే.. వీడు మాత్రం కొంచెం తేడా.. మామూలోడు కాదు.. మహాముదురు. భక్తుడి రూపంలో వెళ్లి ఏకంగా అమ్మవారికే పంగనామాలు పెట్టాడు. గుడిలోకెళ్లి పాడుపని చేస్తే.. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మీ ఆలయానికి ఓ వ్యక్తి భక్తుడి రూపంలో వచ్చాడు. భక్తితో దేవతకు దణ్ణం పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడే వెనకా ముందు ఎవరూ లేదని చూసి.. వెంటనే గర్భగుడిలోకి వెళ్లి.. అమ్మవారి మెడలో ఉన్న బంగారు తాడును కొట్టేశాడు. దాన్ని జేబులో వేసుకుని.. ఎంచక్కా పరారయ్యాడు. ఇక ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ వ్యక్తి.. గుడిలో పూజారి, మరే భక్తులు లేని సమయంలో ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024