శనివారం రాత్రి తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి డ్రైవర్ ను చెంపదెబ్బ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న చలాన్లపై వాగ్వాదానికి దిగిన డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టారు. సఫారీ సూట్ ధరించిన వ్యక్తిని డీఎస్పీ ర్యాంక్ అధికారి తోసేయడం, కొట్టడం వీడియోలో కనిపించింది. ఇదంతా జరుగుతుండగానే తాడు పట్టుకుని పోలీసులు కేకలు వేస్తూ ఘటనను వీడియో తీస్తున్న వారిని బెదిరించారు.
బహిరంగ సభ అనంతరం డ్రైవర్ తన వాహనాన్ని వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే డ్రైవర్ కూడా పాస్ చూపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన తరుణ్ జోషి అతనిపై దాడి చేశాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ గొడవకు సంబంధించిన వీడియో ఒక్కసారిగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సంబంధిత పోలీసు అధికారుల తీరుపై విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల యాదగిరిగుట్టలో భట్టికి జరిగిన అవమానం మరిచిపోకముందే.. తాజాగా భట్టి డ్రైవర్ ను పోలీసులు కొట్టిన వీడియో వైరల్ కావడం చర్చనీయాంశమవుతోంది.
Also read
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
- అతనికి 24.. ఆమెకు 16.. ఇన్స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
- హైదరాబాద్లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్ నిజాలు! చూశారంటే





