అందరూ చూస్తుండగానే ఒక వాలంటీర్ సాటి మహిళను వివస్త్రను చేసి బ్లేడుతో గాయపరిచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం చోటుచేసుకుంది.
పాలకొల్లు పట్టణం, మార్కెట్ – : అందరూ చూస్తుండగానే ఒక వాలంటీర్ సాటి మహిళను వివస్త్రను చేసి బ్లేడుతో గాయపరిచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. పురపాలక సంఘం సరఫరా చేసే నీటి ట్యాంకర్ వద్ద చిన్నపాటి ఘర్షణ తలెత్తగా సూర్యకుమారి అనే మహిళపై అదే ప్రాంతానికి చెందిన వాలంటీర్ కొల్లాబత్తుల మంజు చేయి చేసుకున్నారు. సర్దిచెప్పడానికి బాధితురాలి కుమార్తె విసాక నాగలక్ష్మి వారి వద్దకు వెళ్లగా.. మంజు అందరూ చూస్తుండగానే ఆమె నైటీని చించేశారు. బ్లేడుతో దాడి చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




