ఒంగోలు::
సామూహికంగా భక్తులందరూ స్వామి వారి గోవింద నామాలను చదువుచూ శ్రీగిరి గిరి ప్రదక్షిణ చేసి శ్రీగిరి పై కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అలౌకిక ఆనందాన్ని అందిస్తుందని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఉపాధ్యక్షులు దాసరి నారాయణ రావు, కార్యదర్శి త్రిపురం మల్లిఖార్జున రావు పేర్కొన్నారు.






శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రమును పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వందలాది మంది భక్తులు గోవింద నామాలు పలుకుతూ, స్వామివారి ఉత్సవ విగ్రహమును ఊరేగింపు చేస్తూ గరుడ, హనుమాన్, శంఖు, చక్ర, నామాలు చేతబట్టి శ్రీగిరి పాదపీఠం వద్ద గల బాపూజీ గో శాల వద్ద గోపూజ నిర్వహించారు. గోమాత ముందు నడువగా నాదస్వరము రవముల మధ్య శ్రీగిరి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు అనంతరం స్వామివారిని దర్శించి పరవశులైనారు.
శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాగారముల గుప్తా జంధ్యం, సహకాదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు ధనిశెట్టి రాము తదితరులు కార్యనిర్వహణ చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలోని పలు దేవాలయములలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భగీరథ సెంటర్ భగీరథ ఆలయం వద్ద సగర పుత్రులు ప్రదక్షణలో పాల్గొన్న భక్తులకు పాల ప్రసాదం అందించారు.
గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు ఈ సందర్భంగా అన్నప్రసాద కైంకర్యదారులకు శాలువ కప్పి స్వామి వారికి ఆశీస్సులు అందించారు.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.
- AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?