అమీర్పేట్ స్నాఫ్ చాట్లో పరిచయమైన బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అమీర్పేట సోనాబాయి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న గణేష్ యాదవ్కు ఓ బాలిక(14)తో స్నాప్ చాట్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రోజు సదరు బాలికతో తరచూ మాట్లాడుతుండేవాడు ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించిన అతను వాటిని చూపి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024