అనంతపురం :జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు
* తదుపరి చర్యలలో భాగంగా … ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసుల చర్యలు
* పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చట్ట పరమైన చర్యలు తీసుకోనున్న పోలీసులు
* మృతురాలి కుటుంబ సభ్యులను ఐసిడిఎస్ అధికారులతో కలిసి విచారించిన ఒన్ టౌన్ సి.ఐ రెడ్డెప్ప…మృతురాలి ముగ్గురు పిల్లలను ఐసిడిఎస్ కు అప్పగింత…
* ఈనెల 23 వ తేదీన అంజలిని బేల్దారి పనుల కోసం ఉదయం 9 గంటలకు ఆటోలో తీసికెళ్లిన బాలు అనే బేల్దారి
* తిరిగి అదేరోజు రాత్రి 8 గంటలకు కొందరు అంజలిని స్థానిక షికారి కాలనీలో ఉన్న ఇంటి వద్ద వదలి వెళ్లినట్లు చెబుతున్న ఆమె కుటుంబ సభ్యులు
* ఆ తర్వాత… అదే రోజు రాత్రి 11:30 గంటల సమయంలో అంజలి, ఆమె భర్త రాజు తీవ్రంగా గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి
* ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆమె చనిపోయిందని… అదే రోజు సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలులో భాగంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు సి.ఐ కు వివరించారు… అన్ని కోణాల్లో విచారించి చట్టపరంగా చర్యలు చేపట్టనున్నామని సి.ఐ తెలిపారు
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్లో దారుణం.. బాత్రూం బల్బ్లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య