ఏలూరు, మార్చి 11: అది రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ విద్యా సంస్థ. కానీ ఓ సమస్య అక్కడ విద్యార్థులను గత కొంత కాలంగా వెంటాడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. గతంలోనే పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప విద్యార్థుల బాధ ఏమాత్రం తీరలేదు. నాణ్యమైన ఆహారం అందక ఆకలి కేకలతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుని, తమ లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులకు రోజు రోజుకి సుడిగుండంలా సమస్య పెద్దదౌతుంది. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు, అధ్యాపకులు చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతలేని ఆహార భుజించి అనారోగ్యం పాలవటం కన్నా పస్తులు ఉంటేనే మేలనే భావనలోకి విద్యార్థులు వెళ్లిపోయారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది. ఆ ప్రత్యేక విద్యాసంస్థ ఏంటి.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏంటి.. ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
![](https://sgstvnews.in/wp-content/uploads/2024/03/img-20240311-wa002117861426042795993926.jpg)
నూజివీడు ట్రిపుల్ ఐటి. ఈ పేరు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ఫేమస్. చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడి చదివి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి తమ లక్ష్యాలు నెరవేర్చుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అయితే ఎన్నో శ్రమల నడుమ మంచి మార్కులతో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి అక్కడ చేరిన విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందక అనారోగ్యాల బారిన పడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ట్రిపుల్ ఐటీ హాస్టల్ మెస్లో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. క్లాస్ రూములు బాయ్కాట్ చేసి మరి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మెస్ కాంట్రాక్టర్ అందించే రైస్, కూరలు నాణ్యంగా ఉండడం లేదంటూ, నాసిరకం సరుకులతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో ఆ కాంట్రాక్టర్కు అప్పట్లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉపాధ్యాయులు నోటీసులు జారీ చేశారు. అంతేకాక విద్యార్థులతో ఆహార నాణ్యతపై కమిటీ వేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని తీర్మానం చేశారు.
కానీ అదంతా కాగితాలకే పరిమితమైంది. తాజాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మెస్లో కోడి కూరలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఆదివారం మెస్లో చికెన్ స్పెషల్గా వండుతారు. అలా స్పెషల్గా వండిన చికెన్ కూరలో చనిపోయిన బొద్దింక విద్యార్థుల కంటపడింది. దాంతో విద్యార్థులు ఆహారాన్ని తినకుండానే వదిలేశారు. అంతేకాక విద్యార్థులు తినే అన్నంలో చిన్నచిన్న పురుగులు కూడా ప్రత్యక్షమయ్యాయి. నాణ్యత లేకుండా పురుగులు ఉన్న ఆహారాన్ని ఎలా తినాలంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఎన్నిసార్లు ఉపాధ్యాయులకు, అధికారులకు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్ తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు ఇలాంటి కలుషిత భోజనం ఎందుకు పెడుతున్నారని నిర్వాహకుల్ని ప్రశ్నించారు. దాంతో వారు బొద్దింక పడిన ఆహారం మీకు వడ్డించలేదని బదులిచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి శాశ్వత ఫుడ్ ఇన్స్పెక్టర్, తనిఖీల నిమిత్తం సిబ్బందిని ఏర్పాటు చేసి, మరొకసారి ఇలా జరగకుండా సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read
- శ్రీగంధం దొంగిలించేందుకు వచ్చిన దుండగులు.. అటవీ అధికారులకు భలే దొరికిపోయారు..!
- తాగింది గోరంత.. మిషన్ చూపించేదీ కొండంత”.. లబోదిబోమంటున్న ఆటోవాలా..!
- Missing Mystery: పవన్ కల్యాణ్ చొరవతో.. వీడిన యువతి మిస్సింగ్ మిస్టరీ.. విచారణలో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు!
- ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు..
- అలా చేయోద్దని మందలించిన తల్లి.. మనస్థాపంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే..