అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు చేశారు. బాట జంగాల పాలెం టోల్గేట్ వద్ద కాపు కాసిన పోలీసులకు అనుమానస్పదంగా ఒక కారు కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల సీజన్ సమీపిస్తుంది. దీంతో పోలీసులు నిఘా పెంచ్చారు. ఎక్కడికక్కడ ఫ్లాగ్ మార్చ్లు నిర్వహిస్తున్నారు. శివార్లలో కాపుకాసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తాజాగా.. గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు నిర్వహించారు.

బాట జంగాల పాలెం టోల్గేట్ వద్ద కాపు కాసిన పోలీసులకు అనుమానస్పదంగా ఒక కారు కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించాయి. వెరిఫై చేసి గోవా లిక్కర్గా గుర్తించారు పోలీసులు. 61 మద్యం పోటీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురిని విచారించారు. గోవా నుంచి విమానంలో బయలుదేరి.. విశాఖ ఎయిర్ పోర్టులో దిగి.. ఆ తర్వాత కాకినాడకు కారులో వెళ్తున్నారు. అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీల్లో పట్టుబడిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతం చేశారు పోలీసులు. పట్టుబడిన మద్యం విలువ రూ.30 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు పోలీసులు.
Also read
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్పై తీవ్ర ఆరోపణలు!
- తల్లికి వందనం డబ్బుల కోసం భార్య హత్య





