SGSTV NEWS online
CrimeTelangana

విషం తాగి ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన


హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. విషం తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో చోటుచేసుకుంది. మృతురాలిని కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్రెడ్డి ఏకైక కుమార్తె యశ్వితగా గుర్తించారు. ఆమె ఆరు నెలలుగా హైదరాబాద్లో ఉంటూ నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది. ఒక్కగానొక్క కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యశ్విత మృతికి కారణాలు తెలియరాలేదు.

Also read

Related posts