SGSTV NEWS online
Andhra PradeshCrime

మణప్పురం’లో భారీ మోసం



అంబేద్కర్ కోనసీమ జిల్లా: ద్రాక్షారామలోని మణప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ లో భారీ మోసం జరిగింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు బంగారాన్ని మాయం చేసిన బ్రాంచ్ మాజీ హెడ్.. వాటి స్థానంలో నకిలీ బంగారాన్ని ఉంచారు. వార్షిక తనిఖీల్లో 8 మంది వినియోగదారులకు సంబంధించిన గోల్డ్ ప్యాకెట్లలో అసలు బంగారానికి బదులుగా నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించారు.

మాయమైన బంగారం మొత్తం బరువు సుమారు 151 గ్రాములు. దీని విలువ సుమారు 19 లక్షల 63 వేలు ఉంటుందని నిర్ధారించారు. సంస్థ ఏరియా హెడ్ భాను ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Also read

Related posts