మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కురవి మండలం నేరడ శివారు ఎలుకచెట్టుతండాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల గగన్ విహారిని త్రాచుపాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మృతితో ఆవేదనకు గురైన తండ్రి పామును వెంటాడి చంపాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంటి ముందు ఆడుకుంటుండగా పాముకాటుకు గురైన ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ బాలుడు తండ్రి పామును కసితీరా చంపి పగ తీర్చుకున్నాడు ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారు ఎలుకచెట్టుతండా గ్రామ పంచాయతీ మంచ్యాతండాలో జరిగింది.. బానోతు మధు, అరుణ దంపతుల కుమారుడు గగన్ విహారి(7) త్రాచుపాము కాటుకు గురయ్యాడు. బాలుడు సాయంత్రం వేళ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో రాతిగోడ మధ్య నుండి బయటకు వచ్చిన త్రాచు పాము కాటేసింది.. వెంటనే గమనించిన తండ్రి కుటుంబ సభ్యులు ఆ పామును వెంటాడి హత మార్చారు..
ఈ క్రమంలోనే.. బాలుడ్ని అక్కడి నుండి హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. కానీ ఫలితం దక్కలేదు.. అప్పటికే.. ఆ బాలుడికి ఏడేళ్లకే నూరేళ్లు నిండాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాదుడు మృతి చెందాడు.. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
బుడి బుడి అడుగులతో.. నిత్యం సందడి చేస్తూ.. స్కూల్ కు వెళ్లే గగన్ విహారి మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
వర్షాకాలంలో పాములు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇళ్ల పరిసరాల్లో పొదలు, రాళ్ల కుప్పలు, చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. పాము కాటు వేస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించాలి. సంప్రదాయ వైద్యాలు, మూఢనమ్మకాలను నమ్మకూడదు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





