SGSTV NEWS online
Andhra PradeshCrime

భర్త ఫ్రెండ్‌తో ఎఫైర్.. చూసి గట్టిగా క్లాస్ పీకిన అత్త.. యూట్యూబ్‌లో చూసి చంపిన కోడలు


Crime News : భర్త స్నేహితుడితో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అత్తకు తెలిసి మందలించింది. దీంతో ఆమెను కోడలు హత్య చేసింది.

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో ఇటీవల జరిగిన మైపాటి మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మృతురాలి కోడలు పద్మశ్రీని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమణకుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.

నిందితురాలు పద్మశ్రీకి తన భర్త స్నేహితుడితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. పద్మశ్రీ ప్రవర్తనపై అత్త మాధవి పలుమార్లు మందలించింది. వివాహేతర సంబంధం విషయం చూసి గట్టిగా చెప్పింది. అలాంటి తప్పు చేయెుద్దని హెచ్చరించింది. అయినా పద్మలో మార్పు రాకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. అందరి ముందు తన తప్పును ఎత్తిచూపారన్న కోపంతో, తన సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను వదిలించుకోవాలని పద్మశ్రీ నిర్ణయించుకుంది.

మే 8వ తేదీన, పద్మశ్రీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో నిద్రిస్తున్న అత్తపై దిండుతో అదిమి, గొంతు నులిమి హత్య చేసింది. క్రైమ్ సీరియల్స్ ప్రభావంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. యూట్యూబ్‌లో వచ్చే క్రైమ్ సీరియల్స్ చూసి తప్పుడు మార్గాల్లో నేరాలు చేసి తప్పించుకోవచ్చని అనుకోవడం భ్రమ అని హెచ్చరించారు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో నేరస్థులు చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ కేసును వేగంగా ఛేదించిన రూరల్ సీఐ శివశంకర్, ఎస్సై జంపాని కుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులు అందించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని, తల్లి సాయంతో అత్తను హత్య చేసిన కోడలి ఉదంతం ఇది. సాంకేతికతను నేరాలకు కాకుండా, సన్మార్గంలో వాడాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also read

Related posts