మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మాధురికి సత్యనారాయణ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.అయితే,..
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఒడిదుడుకులు, ఒంటరితనం కారణంగానే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక మాధురి (35) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె మదీనగూడలోని మైత్రీ నగర్ ఫేజ్-2లో నివాసం ఉంటున్నారు. మాధురికి సత్యనారాయణ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో, ఆరు నెలల క్రితమే వారు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నట్లు సమాచారం.
నాలుగు రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు తమ మనవడిని తీసుకుని స్వగ్రామానికి వెళ్లారు. అప్పటి నుండి మాధురి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో, ఇంటి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వారు లోపలికి వెళ్లి చూడగా, మాధురి ఉరివేసుకుని మృతి చెంది కనిపించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఎటువంటి ఆత్మహత్య లేఖ.(Suicide Note) లభించలేదని సమాచారం. విడాకుల అనంతరం ఎదురైన ఒంటరితనం లేదా ఇతర మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
- Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
- Janwada: జన్వాడలో దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసిబిడ్డ అనాథ
- హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?





