శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా లింగాపురం గిరిజనగూడకు చెందిన సునీత అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నరకయాతన పడ్డారు. రోడ్డు మార్గం లేకపోవడంతో ఆమెను సుమారు రెండు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుంటూ వెళ్లి, అక్కడి నుంచి ఆటోలో పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.
గర్భిణులు, బాలింతలు, వృద్ధులు అస్వస్థతకు గురైనప్పుడు ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే వారికి డోలీనే ఏకైక దిక్కవుతోంది. రహదారి నిర్మిస్తామని రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే!
- Achamanam: పూజకు ముందు ఆచమనం ఎందుకు చేస్తారు? శాస్త్రాలు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే
- నేటి జాతకములు 5 ఆగస్టు, 2026
- ‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
- కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా





