విజయనగరం జిల్లాలో భారీ కొండచిలువన చెట్టెక్కుతున్న దృశ్యం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అరుదుగా కనిపించే ఈ ఘటనతో అడ్డతీగల మార్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి ఫుటేజ్ దొరకడం చాలా అరుదు. అందుకే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పరిధిలోని అడ్డతీగల వెళ్లే మార్గంలో అరుదైన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఎక్కువగా నేలపై సంచరించే కొండచిలువను మనం చూస్తుంటాం. కానీ కొండచిలువ ఒక భారీ టేకు చెట్టును ఎక్కుతున్న దృశ్యం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అటవీ పరిసర ప్రాంతాల్లో కనిపించే ఇరవై అడుగుల కొండచిలువ చిమ్మచీకట్లో చెట్టుపైకి మెల్లగా ఎక్కుతుండటాన్ని చూసిన వారు మొదట నమ్మలేకపోయారు. తరువాత పాము చెట్టు ఎక్కుతున్న శబ్దాన్ని గమనించిన స్థానికులు టార్చ్ లైట్తో చెట్టు పైకి ఫోకస్ చేసి చూడగా.. దానికి చాలా బలంగా చుట్టుకొని చాలా సులభంగా పైకి ఎక్కడం వారి కంటపడింది. టార్చ్ లైట్ ఫోకస్ లో పాము చెట్టు ఎక్కుతున్న దృశ్యం చాలా భయానకంగా ఉంది. ఈ విషయం కొద్దిసేపట్లోనే చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని దూరం నుంచే చూడటం ప్రారంభించారు.
కొండచిలువలు సాధారణంగా తమ బలమైన కండరాల సహాయంతో చెట్లను కూడా సులభంగా ఎక్కగలవు. ముఖ్యంగా ఆహారం కోసం లేదా సురక్షిత ప్రదేశం కోసం ఇవి చెట్లపైకి చేరుతాయి. టేకు చెట్టు పైకి ఎక్కుతున్న ఈ కొండచిలువ కూడా అదే కారణంతో పైకి చేరి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి దృశ్యం అరుదుగా కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనతో అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పాములను చూసినప్పుడు వాటిని రెచ్చగొట్టకుండా దూరంగా ఉండటం, వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వడం మంచిదని హెచ్చరిస్తున్నారు. అడవుల్లో ఉండే పాములు, ఇతర వన్యప్రాణులు సహజంగా తమ వాతావరణంలోనే సంచరిస్తాయని, వాటిని ఇబ్బంది పెట్టి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని వన్యప్రాణుల అభిమానులు చెబుతున్నారు.
ప్రస్తుతం చెట్టెక్కిన కొండచిలువను చూసిన స్థానికులు ఘటనతో అడ్డతీగల మార్గం మీదుగా వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు కొంత భయంతో ఉన్నప్పటికీ, అదే సమయంలో ప్రకృతిలోని ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన అనుభూతిని కూడా పంచుకుంటున్నారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





