కామారెడ్డి : మాంసాహారం విష యంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ.. ఇద్దరు చిన్నా రులను అనాథలను చేసింది. క్షణికావేశంలో కొడవలితో భార్య దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. ఆమె కటకటాల పాలయ్యింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండ శివాజీ (30), అతడి భార్య లక్ష్మి మధ్య వారంరోజులుగా గొడవ జరుగుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో శనివారం రాత్రి నాన్వెజ్ వండాలని శివాజీ కోరగా లక్ష్మి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన లక్ష్మి పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై దాడి చేసింది. గొంతు, మెడ భాగంలో లోతుగా తెగడంతో శివాజీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఏడాది, రెండేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మరణించడం, తల్లి అరెస్ట్ కావడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.
Also read
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..





