డబ్బు తీసుకుని.. దారుణానికి సహకరించిన వైనం
నరసరావుపేట: మాచర్ల పరువు హత్య ఘటనలో ఓ పోలీసు అధికారి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమపెళ్లి చేసుకుందని చౌడేశ్వరి(23)ని ఆమె తండ్రే హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో… ఆమె ఆచూకీ కనిపెట్టి, తండ్రికి అప్పగించింది ఓ పోలీసు అధికారేనని తేలింది. కుమార్తె ఆచూకీ కనిపెట్టి అప్పగిస్తే సదరు పోలీసుకు భారీ మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. రెండు విడతలుగా నగదు ఇచ్చినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడని సమాచారం.
ఎలా చేశారంటే..
ప్రేమపెళ్లి చేసుకున్న నాగరాజు, చౌడేశ్వరి జంట నరసరావుపేట మండలం పెదతురకపాలేనికి చెందిన ఖాజా సాయంతో నరసరావుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఖాజాను నరసరావుపేట రూరల్ పోలీసులు పట్టుకుని విచారించగా కొత్తజంట ఆచూకీ చెప్పాడు. మాచర్ల పోలీసులు వారిద్దరినీ తీసుకెళ్లారు. తాను మేజర్న్న, నాగరాజుతోనే ఉంటానని చౌడేశ్వరి చెప్పినా.. ఆ అధికారి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమెను చంపినరోజు ఆ అధికారి సెలవులో ఉన్నారు. పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేయాలనుకున్నా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో హత్యోదంతం బయటపడింది.
Also read
- అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
- Telangana: మెగుడే యముడయ్యాడు.. అదనపు కట్నం మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు!
- స్వామివారికి దాతలిచ్చిన బంగారు కిరీటం తాకట్టు – వచ్చిన డబ్బుతో వ్యాపారం
- Gudiwada Temple గుడివాడ ఆలయంలో కోటి రూపాయల కిరీటం మాయం.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ
- స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..ఈ అసాధ్యురాలు




