తిరుమల ఘాట్ రోడ్డులో గోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని ఇద్దరు భక్తులు బైక్పై తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలలో వెలుగు చూసింది. స్థానిక వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ భద్రతా సిబ్బంది గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ఇద్దరు తమిళనాడు రాష్ట్రం అరక్కోణం తాలుకా మిట్టపిట్టై గ్రామానికి చెందిన నటరాజన్, మునిరత్నంగా పోలీసులు గుర్తించారు. వీరు ఇటీవలే బైక్పై శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. దర్శనం ముగించుకొని ఇంటికి బయల్దేరారు. బైక్ మొదటి ఘాట్లో రోడ్డులోని 30వ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నటరాజన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మనిరత్నం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది గాయపడిన మనిరత్నంను హాస్పిటల్కు తరలించారు.
Also read
- మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం- ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసా?
- Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?





