హైదరాబాద్ నగరంలోని అల్వాల్లో స్విమ్మింగ్ చేస్తూ ఇంటర్ విద్యార్థిని మృత్యువాత పడింది. స్విమ్మింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. అల్వాల్లో ఉన్న VV స్విమ్మింగ్పూల్కి ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది వైష్ణవి. స్విమ్మింగ్ చేస్తూ ముగ్గురు అమ్మాయిలు పైకి రాగా.. వైష్ణవి మాత్రం లోపలే ఉండిపోయింది. అంతలోనే స్విమ్మింగ్ పూల్లో కుప్పకూలిపోయింది. అయితే, వైష్ణవి.. స్విమ్మింగ్పూల్లోనే ఉన్న విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో ఊహించని విషాదం జరిగింది.
15 నిమిషాల తర్వాత స్విమ్మింగ్పూల్ కోచ్ గమనించి పైకి తీసినప్పటికీ వైష్ణవి మృత్యువాతపడింది. స్పృహ కోల్పోయిన వైష్ణవిని ఆస్పత్రికి తరలించినా.. అయితే అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. శామీర్పేట్లోని ఓ కాలేజీలో వైష్ణవి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆదివారం (ఫిబ్రవరి 22) సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లింది. స్విమ్మింగ్ చేయడానికి పూల్కి వచ్చి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. ఊహించనివిధంగా వైష్ణవి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అయితే, వైష్ణవి.. ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్పూల్లో పడి చనిపోయిందా..? లేక అనారోగ్య కారణాలా..? మరేదైనా కారణముందా అనేది తేలాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం- ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసా?
- Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?





