సూర్యాపేటలో ప్రేమ సంబంధిత దాడుల పరంపరలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న యువతి దూరం పెడుతోందనే కోపంతో ఓ యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేటలోని స్నేహానగర్లో జరిగింది. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు యువతి కుటుంబం అంగీకరించకపోవడంతో పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది.
ఇద్దరూ దూరంగా ఉండాలని తీర్మానించారు. దీని తర్వాత స్పందన మహేష్ను దూరం పెడుతూ వచ్చింది. ఆగ్రహించిన మహేష్, స్పందన తన సోదరి ఇంట్లో ఉందని తెలుసుకొని, ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లి ఆమె తలపై సుత్తితో బలంగా దాడి చేశాడు.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





