సూర్యాపేటలో ప్రేమ సంబంధిత దాడుల పరంపరలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న యువతి దూరం పెడుతోందనే కోపంతో ఓ యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేటలోని స్నేహానగర్లో జరిగింది. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు యువతి కుటుంబం అంగీకరించకపోవడంతో పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది.
ఇద్దరూ దూరంగా ఉండాలని తీర్మానించారు. దీని తర్వాత స్పందన మహేష్ను దూరం పెడుతూ వచ్చింది. ఆగ్రహించిన మహేష్, స్పందన తన సోదరి ఇంట్లో ఉందని తెలుసుకొని, ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లి ఆమె తలపై సుత్తితో బలంగా దాడి చేశాడు.
Also read
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
- ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య.. కంపెనీలో చేరిన పది రోజుల్లోనే
- వివాహితను నమ్మించి వంచించిన కేడీలు





