వైఎస్సాఆర్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీ స్థాయికి చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.
వైఎస్సాఆర్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీ స్థాయికి చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.
ఒక మహిళా ఉద్యోగి పట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై మాలల రాజ్యాధికార సాధన సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సమితి అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు బాధితురాలికి అండగా నిలుస్తూ నేరుగా భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఆయన మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై కేవలం రాష్ట్రపతి, ప్రధానికే కాకుండా.. జాతీయ మహిళా కమిషన్, జాతీయ లోకాయుక్త, జాతీయ లోక్ పాల్, జాతీయ ఎస్సీ కమిషన్లకు కూడా అధికారికంగా ఫిర్యాదులు అందాయి. ఎమ్మెల్యే అధికార బలంతో బాధితురాలిని వేధిస్తున్నారని, ఆమెకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిషన్ Special Commission) ఏర్పాటు చేయాలని మాలల రాజ్యాధికార సాధన సమితి డిమాండ్ చేస్తోంది.
డాక్టర్ దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ..
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మహిళల గౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరమని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు, ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆధారాలను సేకరించామని, జాతీయ స్థాయి సంస్థలు స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వీడి, సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ట్విస్ట్లో రైల్వేకోడూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
Also read
- Hyderabad: పట్టపగలే ఇలా తయారయ్యారు ఏంట్రా బాబు…
- వర్తకులు, వ్యాపారులే వారి టార్గెట్… సేవ ట్రస్టులు, అనాథఆశ్రమాల పేరుతో బలవంతపు వసూళ్లు.
- నువ్వేం కొడుకువురా.. కళ్లల్లో పెట్టుకొని పెంచితే గుండెలపై తన్నాడు..
- మౌనిక, రవీంద్ర కలిసింది అక్కడే.. ఆ ఒక్క విషయంతో ఫ్రిడ్జ్లో ముక్కలు ముక్కలుగా.. సంచలన నిజాలు..
- రీల్స్ తెచ్చిన తంటా.. అన్యాయంగా 13 ఏళ్ళ బాలిక బలి.. అసలేమైందంటే?





