పీటీ వారెంట్పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించిన పోలీసులు సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసులో విచారణ కోసం కోర్టుకు తరలింపు
వాహనంలో నుంచి గెడ్డం మీద చేయి వేసి పుష్ప స్టైల్లో స్పందన
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు. పోలీసు వ్యాన్ గుంటూరు కోర్టు ప్రాంగణానికి చేరుకున్న తర్వాత వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అంటూ స్పందించారు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా అంబటి రాంబాబు కూడా వ్యాన్లో సీటు మీద కూర్చుని గెడ్డం కింద చేయిని స్టైల్గా పెట్టి ‘తగ్గేదేలే’ అనే స్టైల్లో రియాక్షన్ ఇచ్చారు. ఆయనను కోర్టుకు తీసుకువస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంబటి రాంబాబు గత నెల 31వ తేదీ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, 2023లో లాటరీ ద్వారా అవినీతికి పాల్పడ్డారని సత్తెనపల్లి జనసేన నేతలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





