గుంటూరు: గుంటూరు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్ఐ రవితేజకు కోర్టు కఠిన శిక్ష విధించింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఎస్ఐ రవితేజ నగరంపాలెంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో, బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును గుంటూరు నాలుగో జిల్లా అదనపు న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో నిందితుడి చేసిన మోసం రుజువు కావడంతో అతడికి 10 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. కాగా, ఎస్ఐ రవితేజ ప్రస్తుతం అమృతలూరు పనిచేస్తున్నాడు. అయితే, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరమని.. బాధిత యువతికి న్యాయం జరిగిందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
Also read
- శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రహస్య కథ తెలుసా?
- మధ్యాహ్నం పూజ చేయొచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.. పూజకు అత్యంత శుభమైన సమయం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!
- కార్మికవర్గంపై దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం….కంటిపోతు రమణ, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు.





