చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో జరిగిన యువకుడి హత్య కలకలం రేపింది. తులసినాయనపల్లి సమీపంలో యువకుడు అనుమానాస్పద మృతి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. హత్యకు గురైన వ్యక్తి తిమ్మరాజుపల్లికి చెందిన చంద్రగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై పోలీసుల విచారణ జరుగుతున్నారు.. ఈ క్రమంలోనే.. చంద్ర మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. చంద్రను హత్య చేశారని పేర్కొంటున్నారు.
ఇంస్టాగ్రామ్ పట్టించింది.
శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లికి చెందిన చంద్ర హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు ఇంస్టాగ్రామ్ పోస్ట్ ను గుర్తించారు.
స్నేహితుడు ఉదయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోతో తనే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత కొంతమంది కూడా ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్ర స్నేహితుల వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం.. వివరాలను వెల్లడించనున్నారు
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




