చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వారి ఆగడాలు శృతిమించి పోతున్నాయి. మొన్నటి వరకు బైక్ పై వచ్చి రోడ్డు పై వెళ్తున్న మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు ఎతుకెళ్లే వారు. ఇప్పుడు రూట్ మార్చారు డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్లి మహిళల మెడలో నుండి బంగారం ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పట్టపగలు చైన్ స్నాచింగ్ చోరీ ఉదంతం కలకలం రేపుతుంది. జోగిపేట పట్టణంలోని సత్యసాయి కాలనిలో వృద్ధురాలు మెడలో నుండి నాలుగు తులాల బంగారం పుస్తెల తాడును లాక్కెళ్లారు దుండగులు. ఇంట్లో ఉన్న శంకరంపేట మణెమ్మ అనే వృద్ధురాలి కంళ్లలో కారం కొట్టి దొంగలించారు.గమనించిన కూతురు వెంకట లక్ష్మీ అడ్డుకునే ప్రయత్నం చేసిన దుండగుడు తోసేసి బైక్ పై పరార్ అయ్యారు. వృద్ధురాలు శంకరమ్మ కూతురు దగ్గర గత కొన్ని రోజులుగా ఉంటుంది. కూతురు వెంకటలక్ష్మి దుండగులన్నీ వెంబడించిన ఫలితం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేసింది.స్థానికుల పిర్యాదుతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న జోగిపేట సిఐ అనిల్ కుమార్ ఎస్సై పాండు వెతికిన దుండగుల జాడ తెలిసిరాలేదు. బాధితురాలి నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు
Also Read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





