కొండపి గ్రామీణం: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్.ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన కసాయి తండ్రి మద్యం మత్తులో కొన్ని రోజుల క్రితం తన రెండో కుమార్తె (12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు.
కడుపు నొప్పి వస్తుందని బాలిక చెప్పడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి..బాలికపై అఘాయిత్యం జరిగిందని నిర్ధరించారు. దీంతో కంగుతిన్న బాలిక తల్లి.. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చింది. గతంలో తన భర్త కూతురిపై చేతులు వేసి తడుముతున్నట్టు గుర్తించింది. అదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. బాలికను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే తల్లి కొండపి పోలీస్ స్టేషన్ కూ వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసుల నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





