ఆ యువతికి 23 ఏళ్లు. మరికొన్ని రోజుల్లో పెళ్లి.. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. ఒకేసారి అక్కాచెల్లెళ్లను ఆ పరిస్థితిలో చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెరియపట్నంలో నూతనంగా అద్దె ఇంట్లోకి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గీజర్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. జోనిగేరి కాలనీలో నివాసం ఉంటున్న అల్తాఫ్ పాషా కుటుంబంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను గుల్ఫామ్ తాజ్ (23), ఆమె సోదరి సిమ్రాన్ తాజ్ (20) గుర్తించారు. గుల్ఫామ్ తాజ్కు ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో ఫ్యామిలీ అంతా బిజీగా ఉంది.
గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు సిస్టర్స్ స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లారు. గీజర్ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ వెలువడింది. ఇది పీల్చడంతో శ్వాస ఆడక సిస్టర్స్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. ఎంతసేపటికీ కూతుళ్లు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూడగా.. అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. పెళ్లి సమయంలోనే ఇద్దరు కూతుళ్లు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
ప్రమాదానికి కారణం ఇదే
మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించిన డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. గీజర్ నుంచి లీకైన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే ఈ యువతులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న మంత్రి వెంకటేష్ మృతుల కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.ఈ ఘటనపై పెరియపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గ్యాస్ గీజర్లు ఉపయోగించేటప్పుడు తగినంత వెంటిలేషన్ ఉండాలని, గీజర్ను కిటికీ లేదా సరైన గాలి మార్గం ఉన్న చోట ఉంచాలని వైద్యులు సూచించారు. కార్బన్ మోనాక్సైడ్ వాసన లేని వాయువు కాబట్టి లీకైన విషయం తెలియక ప్రమాదం జరుగుతుందని వారు తెలిపారు
Also read
- కార్తీక దీపం వెలిగిస్తున్నారా? మర్చిపోకుండా ఈ ఒక్క మంత్రం చదవండి
- నేటి జాతకములు…27 అక్టోబర్, 2025
- అంతులేని సంపద, తిరుగులేని అదృష్టం.. ఇది మెడలో ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో..
- Watch: నాగులచవితి నాడు అద్భుతం..! శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి..
- లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు.. టెక్కీ అరెస్ట్తో వెలుగులోకి సంచలనాలు!





