SGSTV NEWS
Crime

హైదరాబాద్‌లో ముసుగుదొంగల బీభత్సం.. గంటలో ఐదు ఇళ్లలో చోరీ.. షాకింగ్ వీడియో చూస్తే..



మొత్తం ఒక కేజీ వెండి, 12 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇళ్లలో దొంగతనం చేసే సమయంలో అలారం మోగడంతో పరారయ్యారు. మరోవైపు, హయత్ నగర్ లోని పెద్ద అంబర్ పేట్ లో రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. 5కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, 60 వేల నగదు, విలువైన చీరలు ఎత్తుకెళ్లారు. సిసి కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాలు.


హైదరాబాద్ లో ముసుగుదొంగలు బీభత్సం సృష్టించారు. కుత్బుల్లాపూర్ పేట్ బషీర్ బాద్ లో గంట వ్యవధిలో ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇనుప రాడ్లు, కట్టర్లు, వేటకొడవళ్లు, మారణాయుధాలతో చొరబడి పలు ఇళ్లను లూటీ చేశారు. మొత్తం ఒక కేజీ వెండి, 12 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇళ్లలో దొంగతనం చేసే సమయంలో అలారం మోగడంతో పరారయ్యారు. మరోవైపు, హయత్ నగర్ లోని పెద్ద అంబర్ పేట్ లో రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. 5కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, 60 వేల నగదు, విలువైన చీరలు ఎత్తుకెళ్లారు.

వీడియో ఇక్కడ చూడండి..




సిసి కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫుల్ సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమ్యూనిటి లో దొంగల బీభత్సంతో కాలనీ వాసులు, స్థానిక ప్రజలు భయబ్రాంతులకులు గురయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తున్నట్లు తెలిపారు.

Also read

Related posts