ఆంధ్రాకు చెందిన వ్యాపారి అరెస్ట్
చెన్నై: తమిళనాడులోని ఈరోడ్కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి తన స్వస్థలం ఈరోడు కుర్లా ఎక్స్ప్రెస్ రైల్లో రిజర్వ్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తోంది. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటినప్పుడు, ఓ వ్యక్తి ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షాక్కు గురైన మహిళ కేకలు వేయగా, తన తోటి ప్రయాణికుల సాయంతో ఆ వ్యక్తిని ఆమె పట్టుకుంది. తర్వాత రైలు బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేలం రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన శంకర్(45)గా గుర్తించారు. వస్త్ర వ్యాపారం కోసం ఈరోడ్ కు వచ్చినట్లు తేలింది.
Also read
- పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..? అసలు రహస్యం ఇదే!
- July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- మిస్టరీ బ్లాస్టర్.. నిప్పు లేదు.. సిలిండర్ పేలలేదు.. కానీ కిచెన్లో భారీ పేలుడు! భయాందోళనలో జనం!
- Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
- Watch Video: నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు.. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి..!




