చీరాల: బాపట్ల జిల్లా చీరాల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం జరిగింది. విశ్రాంత వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కాజేసిన ఘటన కలకలం రేపింది. చీరాలకు చెందిన ఓ విశ్రాంత వైద్యుడికి ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. మనీలాండరింగ్కు పాల్పడ్డావంటూ బెదిరించారు. డబ్బులు పంపిస్తే తిరిగి ఖాతాలో జమచేస్తామని చెప్పారు. నిజమేనని నమ్మిన విశ్రాంత వైద్యుడు.. పలు దఫాలుగా రూ.1.10 కోట్లు పంపించాడు. ఆ తర్వాత నగదు తన ఖాతాలో జమకాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చీరాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు తెలిపారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





