చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి కంటికి రెప్పలా కాపాడిన తల్లి అతనికి భారంగా మారింది..జీవిత చమరంకం లో ఆపసోపాలు పడుతున్న ఆ తల్లికి అండగా నిలవాల్సిన కొడుకే కసాయిగా మారాడు..సపర్యాలు చేయాల్సి వస్తుంది అని ,జన్మను ఇచ్చిన తల్లిని కడతేర్చాడు..ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని చెప్పడంతో ఆశతో అతనితో వెళ్లిన అమ్మను మంజీరా నదిలో తోసేసి చేతులు దులుపుకున్నాడు..వద్దురా నాన్న అని ఆ తల్లి ఎంత వేడుకున్నా ఆ కసాయి మనసు కరగలేదు..మంజీర లో శవం అయి తేలడంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లా లొ దారుణం జరిగింది.ఎర్రోళ బాలయ్య అనే కసాయి కుమారుడు కన్న తల్లిని మంజీర నదిలో తోసేసి హత్య చేశాడు.తల్లినీ బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చూయిస్తానని తీసుకువచ్చి బాన్సువాడ పరిసర ప్రాంతంలో ఉన్న మంజీర నదిలో తోసేసి హైదరాబాద్ ఫరారయ్యాడు. మంజీర నదిలొ గుర్తు తెలియని వృద్ధురాలి శవం దొరికిందని పిట్లం పోలీసులు ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.బాన్సువాడ మండలం బొర్లం గ్రామస్థురాలనీ గుర్తించి బొర్లం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతురాలు సాయవ్వను కొడుకు అతని తో పాటు మరో బాలుడు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు విచారించగా మరో బాలుడు సహాయంతో బైక్ పై తీసుకెళ్లి మంజీర లో తల్లిని తోసేసినట్లు పోలీసులు నిర్ధారించి, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువకుడు మైనర్ అని డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి తెలిపారు.
తనకు ఏమీ తెలియదని మైనర్ బాలుడు పోలీసులతో చెప్పాడు..ఆసుపత్రికి తీసుకెళ్దాం అనటంతో వృద్ధురాలు ఆశ తన బైక్ పై అతికష్టం మీద కూర్చుందని, నదిలో తోసేపుడు కూడా వేడుకుందని బాలుడు పోలీసులకు వెల్లడించాడు. తల్లి అనారోగ్యంతో ఉండటంతో పడుకున్న చోటే మల,మూత్ర విసర్జన చేసుకుంటుండటంతో దుర్వాసన వస్తుందని తల్లి నీ చంపినట్లు కొడుకు బాలయ్య అంగీకరించినట్టుగా పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటన దురదృష్టమని గ్రామంలో చర్చించుకుంటున్నారు. బాలయ్య భార్య గతంలో ఆత్మహత్య చేసుకుంది..
Also read
- పశ్చిమ గోదావరిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. బజ్జీలు తిని 13 మందికి అస్వస్థత.. Video
- విశాఖలో అక్రమ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్
- మియాపూర్లో విషాదం.. ఒంటరితనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! ఏం జరిగిందంటే..
- రైల్వే ట్రాక్ దగ్గర అనుమానస్పద వ్యక్తులు.. సడెన్గా పోలీసుల ఎంట్రీ.. 10 రౌండ్ల కాల్పులతో..
- పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఘోర ప్రమాదం.. వియ్యంకుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం!





