నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో గత రాత్రి(శుక్రవారం) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది.
మైథిలికి, నిఖిల్ కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్. ఘటన అనంతరం నిందితుడు పీఎస్ లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
Also read
- కొడుకుతో కలిసి.. ప్రియుడిని హతమార్చిన మహిళ
- ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన అన్నదాత
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..





