పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో దారుణం జరిగింది. పొలంలోకి గొర్రెలు వచ్చినాయనే కారణంతో గొర్రెల కాపరులపై పొలం యజమాని గొడ్డలితో దాడికి దిగారు. గొర్రెల కాపరులపై గొడ్డలితో దాడి చేశారు వల్లెపు రాంబాబు, అతని సోదరులు. తమ పొలంలోకి గొర్రెల మందను…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో దారుణం జరిగింది. పొలంలోకి గొర్రెలు వచ్చినాయనే కారణంతో గొర్రెల కాపరులపై పొలం యజమాని గొడ్డలితో దాడికి దిగారు. గొర్రెల కాపరులపై గొడ్డలితో దాడి చేశారు వల్లెపు రాంబాబు, అతని సోదరులు. తమ పొలంలోకి గొర్రెల మందను తోలారనే కారణంతో దాడికి తెగబడ్డారు. గొర్రెల కాపరులు బాబు, కాటమరాజు, సైదయ్యలపై దాడిచేశాడు పొలం యజమాని. ఇద్దరికి తీవ్ర గాయాలయయాయి.
బాధితులను హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, గొర్రెల కాపరులపై గొడ్డలితో దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గొర్రెలకాపరుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





