వివాహం తర్వాత నిరంతర వేధింపులకు గురైన అతుల్య, షార్జా లోని తన అపార్ట్మెంట్ లో మృత్యువాత పడింది. 40 తులాల బంగారం, బైక్ కట్నంగా ఇచ్చినా వేధింపులు ఆగలేదు. ఆమె భర్త కట్నం కోసం వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పాపం ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని భర్తతో కలిసి దేశం కానీ దేశం వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ బిడ్డకు మంచి సంబంధం దొరికింది, ఇక మెట్టింట్లో హాయిగా కాపురం చేసుకుంటుంది అనుకున్నారు. కానీ, వరకట్న వేధింపులు ఆమెను బలికొన్నాయి. దేశం కానీ దేశంలో ఓ ఫ్లాట్లో శవంగా మారిపోయింది. చావుకు ముందు కూడా నరకం చూసి ఉంటుంది పాపం. కన్నీళ్లు పెట్టించే ఓ వివాహిత హత్య ఘటన యూఏఈలో చోటు చేసుకుంది.
కేరళకు చెందిన 29 ఏళ్ల మహిళ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని తన అపార్ట్మెంట్లో మృతి చెంది కనిపించగా, ఆమె భర్త కట్నం కోసం వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. 29 ఏళ్ల అతుల్య షార్జాలోని తన ఫ్లాట్లో మృతి చెంది కనిపించింది. ఆమె 19 ఏళ్ల వయసులో 2014లో సతీష్ను వివాహం చేసుకుంది. జూలై 18, 19 మధ్య సతీష్ అతుల్యను గొంతు కోసి, కడుపులో తన్ని, ప్లేట్ తో తలపై కొట్టాడంతో ఆమె మరణించిందని ఆమె తల్లి ఆరోపించింది. అతుల్య పెళ్లి అయినప్పటి నుంచి కట్నం కోసం వేధింపులకు గురవుతోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సతీష్ కు కట్నంగా 40 తులాలకు పైగా బంగారం, ఒక బైక్ ఇచ్చామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..





