విజయవాడ గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే ఇద్దరు యువకులను రౌడీ షీటర్ కిషోర్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు
విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే ఇద్దరు యువకులు ఓ ఇంట్లో ఉంటున్నారు. వీరి దగ్గరికి రౌడీ షీటర్ కిషోర్ వెళ్లి వాగ్వాదానికి దిగాడు. గొడవ తీవ్రంగా ముదరడంతో కత్తితో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. ఇద్దరు యువకుల మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ కిషోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే హత్యకు గురైన వారిలో ఒకరు విజయనగరానికి చెందిన వారు కాగా, మరొకరు విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Also read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
- ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్కు తీసుకెళ్లి..





