తమిళనాడులో కార్పోరేటర్ గోమతిని తన భర్త నడి రోడ్డుపై నరికి దారుణంగా చంపాడు. గోమతికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో చంపేసి, వెంటనే సమీప పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాడు.
తమిళనాడులో వివాహేతర సంబంధం వల్ల ఓ భర్త భార్యను హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరునింద్రవూర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ గోమతి కౌన్సిలర్గా పని చేస్తుంది. పదేళ్ల కిందట ఈ జంటకు పెళ్లి కాగా వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే గోమతికి వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా గొడవలు జరిగేవి.
అనుమానంతోనే..
గోమతి తాజాగా ఓ అబ్బాయిని కలిసినట్లు భర్తకు తెలిసింది. దీంతో గోమతి భార్య స్టీఫెన్ రాజ్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో భర్త స్టీఫెన్ ఆమెను నడి రోడ్డుపై కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోమతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





