ఏపీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు
Andhrapradesh: ఏపీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ వర్గీయుల పెళ్లి ఊరేగింపుపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.
టీడీపీ నేత తాయన్న కొడుకు ఈరన్న పెళ్లి ఊరేగింపులో వైసీపీ వర్గీయులు దాడిచేశారు. పెళ్లి బృందంపై కర్రలు, ఇటుకలతో దాడి చేయడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పెళ్లి ఊరేగింపు వాహనంపై ఎక్కి వైసీపీ కార్యకర్త తొడగొట్టి హల్చల్ చేశాడు. ఫ్యాన్ సింబల్ తిప్పుతూ పెళ్లి బృందంపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. 12 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ కార్యకర్తల దాడిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఖండించారు. వైసీపీ కార్యకర్తల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారు వైసీపీ ఎంపీపీ ఈరన్న సోదరుడు వెంకయ్య వర్గీయులుగా గుర్తించారు.
Also read
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!
- నేటి జాతకములు..2 జూలై, 2025
- చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత