హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. లక్ష్మిని ఆమె సోదరుడు మదన్బాబు కత్తితో దాడి చేసి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆస్తుల తగాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువై పోతున్నాయి. ఇటీవల కాలంలో కన్నతల్లిదండ్రులతోపాటు తోబుట్టువులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తే ఆస్తి అయినా ఇవ్వు..? లేదా ప్రాణాలైనా ఇవ్వు అన్నట్టు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం
ఆస్తి కోసం..
హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న లక్ష్మిని చూసి చుట్టు పక్కన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే లక్షిని చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





