వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. పందిరి వెంకటనారాయణ 57 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంకటనారాయణ దగ్గర నుంచి రూ.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారం, 3.64 కేజీల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. వెంకటనారాయణ దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడుపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Also read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





