ఆయన ఓ పంచాయతీ కార్యదర్శి. ఆయన ఆస్తుల విలువ చూస్తే బైర్లు కమ్మాల్సిందే. అలా ఉంది మరి మనోడి సంపాదన. ఇతని ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. గత ఫిబ్రవరి 28న చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఏసీబీ సోదాల్లో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు మహేశ్వరయ్య అనే పంచాయతీ కార్యదర్శి. దీంతో మహేశ్వరయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో తిరుపతి రూరల్ మండలం పేరూరు లోని మహేశ్వరయ్య నివాసం అయిన ఏకదంత ఎన్ క్లేవ్తో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మహేశ్వరయ్యకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. భూములకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్స్తో పాటు తిరుపతిలోని ఇంటి స్థలాలు, రెండు ఫ్లాట్లు, 2 కార్లు, కేజీకి పైగా బంగారు నగలు, 2 కిలోల వెండితో పాటు రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మహేశ్వరయ్యకు బినామీ పేర్లతో కూడా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గంగవరంలో ఫామ్ హౌస్, బెంగళూరులో బినామీ పేర్లతో అపార్ట్మెంట్, బద్వేల్ లో అత్త పేరుతో వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు పలమనేరులోని సాయినగర్లో షాపింగ్ కాంప్లెక్స్, జీ ప్లస్ 2 బిల్డింగ్, గంగవరం మండలం కూర్నిపల్లి వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్, పక్కనే నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.అయితే సోదాల్లో ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు రూ. 30 కోట్లకు పైగానే ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.
- AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?