నందికొట్కూరులోని డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్ష కేంద్రంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శ్రీ వైష్ణవి, సాయిరాం కాలేజీల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థులు కాపీ కొట్టకుండా ఒకరినొకరు అడ్డుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో దూరవిద్య పరీక్షల్లో వ్యాప్తి చెందుతున్న మాస్ కాపీయింగ్ను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపించారు.
సాధారణంగా విద్యార్థులు పరీక్షలకు ముందు బాగా చదివి, పరీక్షల్లో బాగా రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు కోరుకుంటారు. అందుకోసం వారి ప్రయత్నంగా బాగా చదువు చెప్పడం, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, వారిలో భయం పోగొట్టేందుకు అసవరమైన గైడెన్స్ ఇవ్వడం చేస్తుంటారు. కానీ, ఎక్కడా లేని విధంగా ఓ ఇద్దరు ప్రిన్సిపాల్స్ తమ కాలేజీ విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదంటూ ఏకంగా పరీక్షా కేంద్రంలోనే గొడవకు దిగారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రిన్సిపాల్సే ఇలా కాపీ కొట్టనివ్వాలంటూ గొడవకు దిగుతుంటే.. ఇంకా ఆ విద్యార్థులకు చదువు ఏం వచ్చి చస్తుందంటూ మండిపడుతున్నారు.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నందికొట్కూరు డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్ష కేంద్రంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య గొడవ జరిగింది. డిస్టెన్స్ పరీక్షలలో మా విద్యార్థులు చూసి రాయకుండా అడ్డుకుంటున్నారని శ్రీ వైష్ణవి, సాయిరాం కాలేజీల ప్రిన్సిపాల్స్ పరస్పరం వాగ్వాదానికి దిగారు. పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ డిస్టెన్స్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





