నందికొట్కూరులోని డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్ష కేంద్రంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శ్రీ వైష్ణవి, సాయిరాం కాలేజీల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థులు కాపీ కొట్టకుండా ఒకరినొకరు అడ్డుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో దూరవిద్య పరీక్షల్లో వ్యాప్తి చెందుతున్న మాస్ కాపీయింగ్ను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపించారు.
సాధారణంగా విద్యార్థులు పరీక్షలకు ముందు బాగా చదివి, పరీక్షల్లో బాగా రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు కోరుకుంటారు. అందుకోసం వారి ప్రయత్నంగా బాగా చదువు చెప్పడం, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, వారిలో భయం పోగొట్టేందుకు అసవరమైన గైడెన్స్ ఇవ్వడం చేస్తుంటారు. కానీ, ఎక్కడా లేని విధంగా ఓ ఇద్దరు ప్రిన్సిపాల్స్ తమ కాలేజీ విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదంటూ ఏకంగా పరీక్షా కేంద్రంలోనే గొడవకు దిగారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రిన్సిపాల్సే ఇలా కాపీ కొట్టనివ్వాలంటూ గొడవకు దిగుతుంటే.. ఇంకా ఆ విద్యార్థులకు చదువు ఏం వచ్చి చస్తుందంటూ మండిపడుతున్నారు.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నందికొట్కూరు డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్ష కేంద్రంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య గొడవ జరిగింది. డిస్టెన్స్ పరీక్షలలో మా విద్యార్థులు చూసి రాయకుండా అడ్డుకుంటున్నారని శ్రీ వైష్ణవి, సాయిరాం కాలేజీల ప్రిన్సిపాల్స్ పరస్పరం వాగ్వాదానికి దిగారు. పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ డిస్టెన్స్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి
Also read
- Atmakur Forest Scam: ఆత్మకూరు ఫారెస్ట్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. కోట్లకు కోట్లే గుటకాయ స్వాహా!
- Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
- సగం ధరకే బంగారం అంటూ ప్రచారం.. ఎగబడి పెట్టుబడి పెట్టిన ప్రజలు.. కట్చేస్తే..
- Telangana: వారాంతపు సంతలో నాన్నతో వెళ్లి పల్లీలు కొనుకున్న బాలుడు – రాత్రి తింటుండగా
- మరో దారుణం.. తండ్రితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసిన భార్యామణి!