ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కి సంబంధించి బ్లాక్ టిక్కెట్ల అక్రమ దందాపై పోలీసులు దాడులు చేశారు. ఎస్ఓటీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 15 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టిక్కెట్ల దందా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు(ఆదివారం, మార్చి 23) ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ టిక్కెట్ల దందా షురూ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించినట్లు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు తెలిపారు
Also Read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?





