మహారాష్ట్ర ముంబైలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నాగ్పాడలోని నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్పై వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ట్యాంక్ శుభ్రం చేయడానికి ఐదుగురు లోపలికి దిగారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగ్పాడలోని నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్పై ఉన్న వాటర్ ట్యాంక్ను ఐదుగురు కూలీలు శుభ్రం చేయడానికి లోపలికి దిగారు. దీంతో ఊపిరాడక వారు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాటర్ ట్యాంకులోనే ఉండిపోయారు
ఈ విషయం తెలుసుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్లు, బీఎంసీ వార్డు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఊపిరాడక అచేతనంగా పడిపోయిన ఐదుగురిని వాటర్ ట్యాంకు నుంచి బయటకు తీశారు. అంబులెన్స్ల్లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నలుగురు కూలీలు మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఒక వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Telangana: దారుణం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
- Durgs : శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!
- Crime News: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేస్తూ.. చివరికి!
- Ranya Rao: కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..! రన్యా రావు సంచలన స్టేట్మెంట్