బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : దంపతుల మధ్య వివాదాల కారణంగా భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని బూరుగుగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి చెందిన పండు సాయికిరణ్, బుట్టాయగూడెం మండలం బూరుగువాడ గ్రామానికి చెందిన గొడ్డ రేఖామాధురి నాలుగేళ్లుగా ప్రేమించుకుని ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. రేఖామాధురి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో వారు రేఖామాధురి పుట్టింటికి వచ్చారు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మళ్లీ వారిద్దరూ గొడవపడగా సాయికిరణ్ చున్నీతో రేఖామాధురి మెడను గట్టిగా లాగి హత్య చేశాడు. అనంతరం ఆమె తండ్రి శ్రీనుకు ఫోన్ చేసి ”మీ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది” అని చెప్పాడు. ఇంటికి వచ్చిన కుటుంబీకులకు సాయికిరణే హత్య చేశాడని అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలవరం డిఎస్పి బి వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సిఐ ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఐ దుర్గామహేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సాయికిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే