తంగెళ్ళమూడి (ఏలూరు) : ‘మా బిడ్డను పోలీసులే చంపేశారు’ అని మరణించిన యశ్వంత్ అనే యువకుడి కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తూ … ఏలూరు జిల్లా ఆసుపత్రి వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. ఏలూరులోని తంగెళ్ళమూడి లో బంగారు యశ్వంత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏలూరు సిసిఎస్ పోలీసులు వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ జిల్లా ఆస్పత్రి వద్ద బంధువులు నిరసన చేపట్టారు. బైక్ల దొంగతనం కేసులో యశ్వంత్ ను అనుమానితుడిగా గత మూడు రోజుల క్రితం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల నుంచి కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి సిసిఎస్ పోలీసులు తమ కుమారుడిని చిత్రహింసలకు గురి చేశారని బాధిత బంధువులు తెలిపారు. పోలీసులు దాడి చేయడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని యువకుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యింది. మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. యువకుడి శరీరంపై బలమైన గాయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే తమ బిడ్డను చంపేశారని కుటుంబీకులు, బంధువులు వాపోయారు.
Also read
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..





